మనీ లాండరింగ్ కేసులో తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న సుఖేష్ చంద్రశేఖర్ మరో లేఖ రాశారు. గతంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు లేఖలు రాసి సంచలనం సృష్టించగా..ఈసారి బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్కు ప్రేమ లేఖ రాశారు. ఈస్టర్ సందర్భంగా ఆమెకు స్పెషల్ లెటర్ రాశారు. పండుగ విషెష్ తెలిపారు.
ప్రేమగా...
మై బేబీ..... మై బన్ని ర్యాబిట్ అంటూ అంటూ లేఖను మొదలు పెట్టిన సుఖే చంద్రశేఖర్..బేబీ ఐ విష్ యు వెరీ హ్యాపీ ఈస్టర్ అని శుభాకాంక్షలు తెలిపారు. నీకు ఇష్టమైన పండుగల్లో ఈ స్టర్ ఒకటి అని..అయితే ఈస్టర్ సందర్భంగా నిన్ను మిస్ అవుతున్నానంటూ లేఖలో పేర్కొన్నారు.
మై బేబీ, నువ్వు ఎంత అందంగా ఉంటావో నీకు తెలుసా...? ఈ భూమ్మిద నీ అంత అందంగా ఎవ్వరూ ఉండరు. నా కుందేలు.., నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు ఎప్పటికీ నాదానివే ..! అంటూ జాక్వెలిన్ పై తన ప్రేమను లేఖ రూపంలో వ్యక్తపరిచారు. త్వరలో అన్ని సమస్యలు క్లియర్ అవుతాయని..అందరినీ చూడబోతున్నానని వెల్లడించారు. వచ్చే ఈస్టర్ను ఇద్దరం కలిసి మరింత స్పెషల్గా జరుపుకుందామని లేఖలో వెల్లడించారు.
నీ గురించే ఆలోచిస్తున్నా..
సుఖేష్ చంద్రశేఖర్ తన లేఖలో జాక్వెలిన్కు ఓ పాటను అంకితం చేశారు. తు మైలే, ఔర్ దిల్ కిలే, ఔర్ జీనే కో క్యా చాహియే.. కొత్త వెర్షన్ విన్నప్పుడు నీ గురించే ఆలోచిస్తున్నాను అంటూ పేర్కొన్నారు. జాక్వెలిన్తో పాటు..ఆమె తల్లిదండ్రులకు కూడా ఈస్టర్ శుభాకాంక్షలు చెప్పారు. సుఖేష్ చంద్రశేఖర్ పలు మార్లు లేఖలు రాశారు. సుఖేష్ బర్త్ డేతో పాటు హోలీ రోజున లేఖలు పంపారు. మై బేబీ జాక్వెలిన్..... నా పుట్టిన రోజు నిన్ను చాలా మిస్ అవుతున్నా.... నీ మాటలను... నీ ఎనర్జీని చాలా మిస్ అవుతున్నా... కానీ నా మీద నీకున్న ప్రేమ ఎంతో గొప్పది... అది ఎప్పటికీ తగ్గది. నీ అందమైన హృదయంలో ఏముందో తెలుసు. దానికి ఆధారాలు అవసరం లేదు. నా జీవితంలో వెల కట్టలేని కానుక నువ్వు. బుట్టబొమ్మా నేను ఎంతో ప్రేమిస్తున్నాను..అంటూ సుఖేష్ ఆ లేఖలో రాశాడు.