సూర్యనారాయణ స్వామి వారి పాదాలను తాకిన భానుడి కిరణాలు

సూర్యనారాయణ స్వామి వారి పాదాలను తాకిన భానుడి కిరణాలు

శ్రీకాకుళం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అరసవల్లి సూర్యనారాయణ స్వామి వారిని భానుడి కిరణాలు తాకాయి. పంచ ద్వారాలను దాటి గాలిగోపురం మధ్య నుంచి సూర్యకిరణాలు ఆదిత్యుని పాదాలను తాకిన అద్భుత ఘట్టం ఇవాళ(బుధవారం) ఆవిష్కృతమైంది. ఈ సమయంలో ప్రత్యక్ష భగవానుడి నామస్మరణ చేస్తూ భక్తులు పులకరించిపోయారు. తెల్లవారుజాము నుంచే ఈ అద్భుత దృశ్యాన్ని చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. దాదాపు ఆరు నిమిషాలు పాటు భక్తులకు ఈ దర్శన భాగ్యం కలిగింది.

సూర్యనారాయణ స్వామి వారి  పాదాలను తాకి శిరస్సు వెల్లే ఈ అద్భుత ఘట్టం ఏటా మార్చి 9,10 తేదీల్లో …అక్టోబర్  1,2వ తేదీల్లో భక్తులకు కనువిందు చేస్తుంది.