
హైదరాబాద్, వెలుగు: తమ వెల్త్ మేనేజ్మెంట్ విభాగం "సుందరం వెల్త్"ను ఉన్నత నికర విలువ కలిగిన వ్యక్తులు (హెచ్ఎన్ఐలు), సంపన్న కుటుంబాలకు ప్రత్యేక సేవలను అందించే లక్ష్యంతో విస్తరించినట్టు సుందరం ఫైనాన్స్ తెలిపింది. ఇది స్ట్రాటజిక్ ఫైనాన్షియల్ ప్లానింగ్, పోర్ట్ఫోలియో అలకేషన్, రిస్క్ మేనేజ్మెంట్ సహా విస్తృతమైన ఆర్థిక పరిష్కారాలను అందించనుంది. అధునాతన వెల్త్ మేనేజ్మెంట్ పరిష్కారాలు అవసరమైన కుటుంబాలు, వ్యక్తులే లక్ష్యంగా సేవలు అందిస్తామని సుందరం వెల్త్ తెలిపింది.