హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు ఆ పార్టీ ముఖ్య నేతలతో మంగళవారం సమావేశమయ్యారు. గాంధీభవన్లో స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్తో సునీల్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పీసీసీ చీఫ్ రేవంత్, ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
సమావేశంలో భాగంగా ఎన్నికల కమిటీ అభ్యర్థుల జాబితాపై చర్చించినట్టు తెలిసింది. తొలి జాబితాలో పేర్కొన్న అభ్యర్థులపై కమిటీ నివేదికను ఇచ్చినట్టు సమాచారం. మరోవైపు సీడబ్ల్యూసీ సమావేశాలు, సెప్టెంబర్ 17న నిర్వహించనున్న బహిరంగ సభపైనా చర్చించినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.