శామీర్ పేట, వెలుగు: మల్కాజ్గిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పట్నం సునీతా మహేందర్ రెడ్డి సోమవారం నామినేషన్ వేశారు. పార్టీ శ్రేణులతో కలిసి ర్యాలీగా వెళ్లి మేడ్చల్కలెక్టరేట్లో కలెక్టర్ గౌతమ్ కు నామినేషన్ పత్రాలు అందజేశారు. ఆమె వెంట మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు హరివర్ధన్ రెడ్డి, మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మేడ్చల్ నియోజకవర్గ ఇన్చార్జ్ వజ్రాశ్ యాదవ్ ఉన్నారు.