నర్సాపూర్లో అసంతృప్తులకు బుజ్జగింపులు

 నర్సాపూర్లో అసంతృప్తులకు బుజ్జగింపులు

శివ్వంపేట, వెలుగు: నర్సాపూర్​ నియోజకవర్గ బీఆర్​ఎస్​ అభ్యర్థి సునీతా లక్ష్మారెడ్డి శుక్రవారం మండలంలోని ఉసిరికపల్లికి చెందిన పార్టీ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్యే మదన్​ రెడ్డి అనుచరుడు కృష్ణారావు ఇంటికి వెళ్లి ఎన్నికల్లో మద్దతివ్వాలని కోరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..సిట్టింగ్ ఎమ్మెల్యే మదన్ రెడ్డికి సముచిత స్థానం కల్పిస్తామన్నారని తెలిపారు. తన గెలుపుకోసం ప్రతి ఒక్కరూ పని చేయాలని కోరారు.

కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్​ చంద్రాగౌడ్​, జడ్పీటీసీ మహేశ్​గుప్తా, మండల పార్టీ అధ్యక్షుడు రమణ గౌడ్, ఆత్మ కమిటీ చైర్మన్ వెంకట్ రెడ్డి,  సొసైటీ  చైర్మన్ వెంకట్రాంరెడ్డి, సర్పంచ్ బాబురావు పాల్గొన్నారు.