
హైదరాబాద్లో ఉప్పల్ స్టేడియం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్తో జరుగుతోన్న మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టు భారీ స్కోర్ చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన రాజస్థాన్ టీమ్ నిర్ణీత 20 ఓవర్లలలో 5 వికెట్ల నష్లానికి 203 పరుగులు చేసింది. ఓపెనర్లు జోస్ బట్లర్(54), జైస్వాల్(54) ఆ జట్టుకు మంచి శుభారంభాన్ని అందించారు. ఇద్దరు దూకుడుగా ఆడటంతో రాజస్థాన్ జట్టు 5 ఓవర్లకే స్కోరు 70 దాటింది.
వరుసగా ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడుతున్న బట్లర్ 20 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. అయితే ఫజల్ హక్ ఫారూఖి బౌలింగ్ లో క్లీన్బౌల్డ్ అయ్యాడు. ఆ తరువాత కెప్టెన్ సంజూ శాంసన్ తో కలిసి ఇన్నింగ్స్ ను దూకుడుగా నడిపించాడు జైస్వాల్. అర్ధ శతకం పూర్తి చేసుకున్నాక ఫజల్ బౌలింగ్ లో అతను వెనుదిరిగాడు. ఆ తరువాత వచ్చిన పడిక్కల్ (2), రియాన్ పరాగ్ (7) త్వరగానే వెనుదిరిగారు.
త్వరత్వరగా రెండు వికెట్లు పడ్డనప్పటికి సంజూ శాంసన్ (55) మాత్రం ఫాస్ట్ గా ఆడుతూ 28 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. అనంతరం నటరాజన్ వేసిన 18.3 ఓవర్కు శాంసన్ భారీ షాట్ ఆడగా.. బౌండరీ లైన్ వద్ద అభిషేక్ శర్మ సూపర్ క్యాచ్ అందుకున్నాడు. హైదరాబాద్ బౌలర్లలో ఫజల్ హక్ ఫారూఖి, నటరాజన్ తలో రెండు వికెట్లు పడగొట్టగా ఉమ్రాన్ మాలిక్ ఒక వికెట్ తీశాడు.