జానారెడ్డికి మద్దతివ్వండి: సీపీఐ, సీపీఎంలకు కాంగ్రెస్ లెటర్

జానారెడ్డికి మద్దతివ్వండి: సీపీఐ, సీపీఎంలకు కాంగ్రెస్ లెటర్

హైదరాబాద్, వెలుగు: సాగర్ ఉప ఎన్నికలో జానారెడ్డికి మద్దతివ్వాలని కోరుతూ లెఫ్ట్ పార్టీలకు కాంగ్రెస్ నేతలు లేఖ రాశారు. సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు చాడ వెంకటరెడ్డి, తమ్మినేని వీరభద్రంలకు పీసీసీ చీఫ్, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆదివారం లేఖ రాశారు. ఫోన్లలోనూ మాట్లాడి మద్దతు కోరారు. రాష్ట్ర కమిటీ సమావేశంలో, పార్టీ నేతలతో చర్చించి నిర్ణయం వెల్లడిస్తామని లెఫ్ట్ పార్టీల కార్యదర్శులు కాంగ్రెస్ నేతలకు చెప్పినట్లు తెలిసింది. వచ్చే నెల 17న జరగనున్న సాగర్ ఉప ఎన్నికకు, ఈ నెల 30తో నామినేషన్ దాఖలు పక్రియ ముగియనుంది. అయితే, ఇంత వరకు లెఫ్ట్ పార్టీలు తమ అభ్యర్థిని ప్రకటించలేదు.