ఫైబర్నెట్ స్కాంలో బాబు ముందస్తు బెయిల్పై విచారణ వాయిదా

ఫైబర్నెట్ స్కాంలో బాబు ముందస్తు బెయిల్పై విచారణ వాయిదా

సుప్రీం కోర్టులో టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ పిటీషన్ పై విచారణ వాయిదా పడింది.   ఫైబర్ నెట్ స్కాంలో చంద్రబాబు  ముందస్తు బెయిల్ పిటీషన్ పై డిసెంబర్ 12వ తేదీ మంగళవారం మధ్యాహ్నం సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. ఈ కేసులో చంద్రబాబు తరపున సీనియర్ లాయర్ సిద్దార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు.

ఇరు వర్గాల వాదనలు విన్న జస్టిస్‌ అనిరుద్ధబోస్‌, జస్టిస్‌ బేల ఎం త్రివేది నేతృత్వంలోని  ధర్మాసనం.. బాబు ముందస్తు బెయిల్ పై విచారణను వచ్చే ఏడాది  జనవరి 17వ తేదీకి వాయిదా వేసింది. కేసుకు సంబంధించి బహిరంగ ప్రకటనలు చేయొద్దని చంద్రబాబు, ఎపీ ప్రభుత్వాన్ని సుప్రీం ఆదేశించింది. చంద్రబాబు నిబంధనలకు విరుద్ధంగా ప్రకటనలు చేసి ఉంటే.. ఆ రికార్డులను తమకు సమర్పించాలని న్యాయస్థానం ప్రభుత్వానికి తెలిపింది.