దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ కేసు విచారణ వాయిదా

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ కేసు విచారణ వాయిదా

న్యూఢిల్లీ: దిశ నిందితుల ఎన్కౌంటర్ కేసు విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ నివేదికను పూర్తిస్థాయిలో పరిశీలించాకే తదుపరి విచారణ కొనసాగిస్తామని ధర్మాసనం ప్రకటించింది. దిశ కేసు నిందితుల ఎన్కౌంటర్పై ఆరోపణలు వెల్లువెత్తడంతో సర్వోన్నత న్యాయస్థానం జస్టిస్ సిర్పూర్కర్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది. దాదాపు 47 రోజుల పాటు క్షేత్రస్థాయిలో విచారణ జరిపిన కమిషన్. అప్పటి సీపీ సజ్జనార్, సిట్ ఛైర్మన్ మహేశ్ భగవత్, శంషాబాద్ డీసీపీతో పాటు పలువురు పోలీసు అధికారులను ప్రశ్నించింది. ఎన్కౌంటర్లో మృతి చెందిన వారి కుటుంబాల వాగ్మూంలాలు సేకరించింది. విచారణ పూర్తైన అనంతరం సిర్పూర్కర్ కమిషన్ సుప్రీంకోర్టుకు నివేదిక అందజేసింది. కరోనా కారణంగా దర్యాప్తు ఆలస్యమైందని కోర్టుకు తెలపగా.. కేసు విచారణలో జాప్యాన్ని ఏ మాత్రం అంగీకరించమని సీజేఐ ఎన్వీ రమణ స్పష్టం చేశారు. ఈ కేసులో మధ్యంతర దరఖాస్తుల స్వీకరణకు నిరాకరించారు. 

2019 డిసెంబర్ 6న దిశ అత్యాచార కేసులో నిందితులైన నలుగురు పోలీసుల ఎన్కౌంటర్లో హతమయ్యారు. విచారణ సమయంలో నిందితులు పోలీసులపై కాల్పులు జరపడంతో ఎన్కౌంటర్ చేసినట్లు అప్పటి సీపీ సజ్జనార్ తెలిపారు. అయితే అది ఫేక్ ఎన్కౌంటర్ అన్న విమర్శలు వెల్లువెత్తడంతో నిజనిర్థారణ కోసం సుప్రీంకోర్టు 2019 డిసెంబర్ 12న జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ను ఏర్పాటు చేసింది. దర్యాప్తు జరిపిన కమిటీ 57మంది సాక్షుల వాంగ్మూలాలను నివేదికలో పొందిపరిచింది.

FOr more news..

ఒమిక్రాన్ సైలెంట్ కిల్ల‌ర్

దేశంలో దుర్మార్గ‌మైన ప‌నులు జ‌రుగుతున్నాయి