
న్యూఢిల్లీ: ముంబైలో 2001లో జరిగిన హోటల్యజమాని జయ శెట్టి హత్య కేసులో గ్యాంగ్స్టర్ చోటా రాజన్కు బాంబే హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ను సుప్రీంకోర్టు బుధవారం రద్దు చేసింది. 2001 మే 4న చోటా రాజన్ మనుషులు జయ శెట్టిని కాల్చి చంపారు. జయ శెట్టికి ఫోన్చేసి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశాడని.. ఆయన డబ్బులు ఇవ్వకపోవడంతో హత్య చేశారని పోలీసుల దర్యాప్తులో తేలింది. 2024 మేలో ఈ కేసులో ప్రత్యేక కోర్టు రాజన్ను దోషిగా నిర్ధారించి జీవిత ఖైదు విధించింది. కాగా, ఈ కేసులో గత సంవత్సరం అక్టోబర్ 23న రాజన్ జీవిత ఖైదును నిలిపివేసి, అతనికి బెయిల్ మంజూరు చేస్తూ బాంబే హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.