వన్యప్రాణుల దాడి మృతులకు 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలి

వన్యప్రాణుల దాడి మృతులకు 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలి
  • అన్ని రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ఆదేశం

న్యూఢిల్లీ: వన్యప్రాణుల దాడిలో ఎవరైనా ప్రాణాలు కోల్పోతే ఆ కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్​గ్రేషియాను తప్పనిసరిగా చెల్లించాలని అన్ని రాష్ట్రాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. వన్యప్రాణుల దాడిని ప్రకృతి వైపరీత్యంగా పరిగణించాలని సూచించింది. ఇప్పటికే పలు రాష్ట్రాలు ఇదే స్థాయిలో ఎక్స్​గ్రేషియా  చెల్లిస్తున్నాయి. మిగతా రాష్ట్రాలు కూడా దీన్ని అమలు చేయాలని, ఇంతే మొత్తం పరిహారంగా చెల్లించాలని సుప్రీంకోర్టు చీఫ్​ జస్టిస్​ బీఆర్​ గవాయ్, జస్టిస్​ ఏజీ మసీమ్​తో కూడిన బెంచ్​సోమవారం ఆదేశించింది. 

ఇంటిగ్రేటెడ్​ డెవలప్​మెంట్​ఆఫ్​ వైల్డ్​ లైఫ్​ హ్యాబిటేట్స్ పథకం కింద పరిహారం ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది.  హ్యూమన్, వైల్డ్​లైఫ్​ కాన్​ఫ్లిక్ట్​ నివారణకు ఆరు నెలల్లో గైడ్​లైన్స్ రూపొందించాలని నేషనల్​ టైగర్​ కన్జర్వేషన్​ అథారిటీ (ఎన్​టీసీఏ)కు సుప్రీంకోర్టు ఆర్డర్​ జారీ చేసింది. ఈ గైడ్ లైన్స్ అందిన 6 నెలల్లోగా తప్పకుండా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది.