మీ తప్పుడు యాడ్స్ ఆపేయండి : పతంజలికి సుప్రీంకోర్టు ఆదేశం

 మీ తప్పుడు యాడ్స్ ఆపేయండి : పతంజలికి సుప్రీంకోర్టు ఆదేశం

సుప్రీం కోర్టు యోగా గురు రామ్ దేవ్ బాబాకు నోటీసులు జారీ చేసింది. రామ్ దేవ్ బాబా, పతంజలి మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలకృష్ణ లు  ఆయుర్వేదిక్ ప్రాడక్ట్స్ పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని కోర్టు మంగళవారం (ఫిబ్రవరి 27)న ధిక్కార నోటీసులు పంపించింది. మళ్లీ కోర్టు అనుమతించే వరకూ పతంజలి ఆయుర్వేదిక్ మెడికల్ ఉత్పత్తులపై ఎలాంటి యాడ్స్ ప్రకటించవద్దని  కోర్టు ఆదేశించింది. అల్లోపతికి వ్యతిరేకంగా పతంజలి ప్రాడక్ట్స్ ప్రకటనలు ఉన్నాయని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. 

పతంజలి డయాబెటిస్, ఆస్తమా వంటి వ్యాధులను ఆయుర్వేదిక్ మందులు, యోగాతో  పూర్తిగా నయం చేస్తుందని అడ్వటైజింగ్ చేయడాన్ని ఇండియన్ మెడికల్ కౌన్సిల్ తప్పుబట్టింది.  రామ్ దేవ్ బాబా మెడిసిన్ వాడకంపై వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని IMA  కోర్టుకు ఫిర్యాదు చేసింది. రామ్‌దేవ్‌పై భారత శిక్షాస్మృతి (ఐపీసీ)లోని 188, 269, 504 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

గతంలో  కోవిడ్ -19 వ్యాక్సినేషన్‌కు వ్యతిరేకంగా పతంజలి వ్యవస్థాపకులు రామ్ దేవ్ బాబా క్యాంపెయిన్ నిర్వహించిందని ఆరోపిస్తూ IMA దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు బెంచ్ విచారించింది. పతంజలి ఆయుర్వేదిక్ వ్యాధుల్ని  వెంటనే, పూర్తిగా నయం చేస్తుందని చేసిన యాడ్స్ పై సుప్రీం కోర్టు సీరియస్ అయింది. ఇలాంటి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ తో యాడ్స్ పబ్లిసిటీ చేసినందుకు పతంజలిపై చర్యలు తీసుకుంటాయని సుప్రీం కోర్టు హెచ్చరించింది. తదుపరి విచారణ ఉంటుందని కోర్టు మార్చ్ 15కు వాయిదా వేసింది.