హిజాబ్ వివాదంపై పిటిషన్ తిరస్కరించిన సుప్రీం

హిజాబ్ వివాదంపై పిటిషన్ తిరస్కరించిన సుప్రీం

న్యూఢిల్లీ : హిజాబ్ వివాదంపై మైనార్టీ విద్యార్థిని దాఖలు చేసిన పిటీషన్పై అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది. విద్యాసంస్థల్లో ధార్మిక వస్త్రాలు ధరించవద్దన్న కర్నాటక హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన పిటీషన్ను తిరస్కరించింది. సరైన సమయంలో ఈ అంశంపై విచారణ జరుపుతామని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ విషయాన్ని పెద్దది చేసి జాతీయస్థాయి సమస్యగా చూడవద్దని సీజేఐ ఎన్వీ రమణ లాయర్లకు సూచించారు. ఏం జరుగుతుందో తాము గమనిస్తున్నామని ఇలాంటి అంశాలను జాతీయస్థాయిలో చర్చకు తీసుకురావడం సబబేనా అని ప్రశ్నించారు. 

ఇదిలా ఉంటే హిజాబ్ వివాదంపై కేసు విచారణను కర్నాటక హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలని  దాఖలైన పిటీషన్ను సుప్రీంకోర్టు గురువారం తోసిపుచ్చింది. ఈ కేసును తొమ్మిది మంది సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనానికి బదిలీ చేయాలని సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ కోరారు.  అయితే ఈ అంశంపై హైకోర్టు విచారణ జరుపుతున్నందున ఈ దశలో జోక్యం చేసుకోవడం సరికాదని సీజీఐ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం అభిప్రాయపడింది. కర్నాటక హైకోర్టు కోరితే పరిశీలిస్తామని స్పష్టం చేసింది. 

For more news..

ఎమ్మెల్సీ అశోక్ బాబు అరెస్ట్

అప్పుడేమో ఉద్యమకారుల్లా... ఇప్పుడేమో ఉగ్ర‌వాదుల్లా కనిపిస్తున్నారా?