
సుప్రీంకోర్టులో చంద్రబాబుకు చుక్కెదురైంది. ఫైబర్ నెట్ స్కాంలో ముందస్తు బెయిల్ ఇవ్వాలని చంద్రబాబు వేసి పిటీషన్ పై విచారణను సుప్రీం కోర్టు వాయిదా వేసింది. చంద్రాబాబు పిటీషన్ పై నవంబర్ 9న విచారించనున్నట్లు సుప్రీంకోర్టు వెల్లడించింది. మొదట నవంబర్ 8కి విచారణను వాయిదా వేసిన ధర్మాసనం.. చంద్రబాబు తరపు న్యాయవాది విజ్ఞప్తి మేరకు నవంబర్ 9వ తేదీకి విచారణను వాయిదా వేసింది.