
న్యూఢిల్లీ: కోటాలో స్టూడెంట్ల వరుస ఆత్మహత్యలపై రాజస్థాన్ ప్రభుత్వంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోటాలోనే స్టూడెంట్లు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని నిలదీసింది. అసలు కోటాలో ఏం జరుగుతున్నదని ప్రశ్నించింది. ఈ ఏడాది ఇప్పటి దాకా 14 మంది స్టూడెంట్లు ఆత్మహత్య చేసుకుంటే.. రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నదని నిలదీసింది.
కోటాలో నెలకొన్న పరిస్థితులపై జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ ఆర్.మహదేవన్తో కూడిన బెంచ్ ఆందోళన వ్యక్తం చేసింది. మే 4న కోటాలో నీట్కు సిద్ధమవుతున్న ఓ విద్యార్థిని, ఐఐటీ ఖరగ్ పూర్ హాస్టల్లో మరో విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ కేసును సుప్రీం కోర్టు సుమోటోగా స్వీకరించి శుక్రవారం విచారణ చేపట్టింది.
స్టూడెంట్ల ఆత్మహత్యలు పట్టవా..?
స్టూడెంట్ల ఆత్మహత్యలు పట్టవా అని రాజస్థాన్ సర్కార్ను సుప్రీం బెంచ్ప్రశ్నించింది. ‘‘ఐఐటీ ఖరగ్పూర్కు స్టూడెంట్.. మే 4న హాస్టల్ గదిలో ఉరివేసుకొని చనిపోతే పోలీసులు మే 8న ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కేసు నమోదుకు 4 రోజులు ఆలస్యం ఎందుకు అయ్యింది..? స్టూడెంట్లు ఆత్మహత్యలు చేసుకుంటుంటే మీరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారా..? ఈ అంశాన్ని తేలిగ్గా తీసుకోవద్దు. ఒక్క కోటాలోనే 2018 నుంచి ఇప్పటి దాకా 106 మంది స్టూడెంట్లు ఆత్మహత్య చేసుకున్నారు’’ అని బెంచ్ పేర్కొంది.