
ఏపీ, తెలంగాణ బార్ కౌన్సిల్స్ కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. తెలంగాణ హైకోర్టు ఏర్పాటుపై బార్ కౌన్సిల్ ఎన్నికలు జరగడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సరదా గౌడ్ అనే న్యాయవాది సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అడ్వకేట్స్ యాక్ట్ సవరణ జరగకముందే తెలంగాణ బార్ కౌన్సిల్ ఏర్పాటు చెల్లదంటూ సుప్రీంకోర్ట్ లో పిటిషన్ వేశారు సరదా గౌడ్.
నిబంధనలకు విరుద్ధంగా జరిగిన బార్ కౌన్సిల్ ఎన్నికలను వెంటనే రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టును కోరారు పిటిషనర్. అడ్వకేట్స్ యాక్ట్ లో సవరణ చేయలేదని సుప్రీంకోర్టుకు తెలుపుతూ.. కౌంటర్ దాఖలు చేసింది కౌన్సిల్ ఆఫ్ ఇండియా. పిటిషన్ పై వెంటనే అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ.. ఏపీ, తెలంగాణ బార్ కౌన్సిల్ లకు నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు.