ధోనీ బాట‌లోనే రైనా.. ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్‌కు గుడ్ బై

ధోనీ బాట‌లోనే రైనా..  ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్‌కు గుడ్ బై

భారత క్రికెట్ అభిమానులకు మరో షాక్ తగిలింది. టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన నిమిషాల్లో మ‌రో క్రికెటర్ కూడా అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్, ధోని సన్నిహితుడు సురేశ్ రైనా క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇన్‌స్టగ్రామ్ వేదికగా సురేష్ రైనా త‌న రిటైర్మెంట్ ప్రకటించాడు. టీమిండియాలో ధోనీ, రైనా మంచి మిత్రులు.  ఐపీఎల్‌లో ఎంఎస్ ధోనీ, సురేష్ రైనా చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడనున్నారు.