
సూర్య హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల పూజా కార్యక్రమాలతో ప్రారంభించిన ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్కు ముహూర్తం ఫిక్స్ చేశారు మేకర్స్. జూన్ 9 నుంచి రెగ్యులర్ షూటింగ్ను మొదలుపెడుతున్నట్టు తెలియజేశారు. షూటింగ్ స్టార్ట్ చేసే ముందు హీరో సూర్యతో పాటు దర్శకుడు వెంకీ అట్లూరి, నిర్మాత నాగవంశీ తమిళనాడులోని పళని దేవాలయం వెళ్లి సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకున్నారు.
సూర్య కెరీర్లో ఇది 46వ సినిమా. ‘ప్రేమలు’ ఫేమ్ మమిత బైజు ఇందులో హీరోయిన్గా నటిస్తోంది. రవీనా టాండన్ ఈ సినిమాతో తెలుగులో రీఎంట్రీ ఇస్తుండగా, రాధిక శరత్కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు ప్రకటించారు.