GT vs MI: ముంబై మొనగాడు: అసాధారణ నిలకడ.. సచిన్ రికార్డ్ బ్రేక్ చేసిన సూర్య

GT vs MI: ముంబై మొనగాడు: అసాధారణ నిలకడ.. సచిన్ రికార్డ్ బ్రేక్ చేసిన సూర్య

ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ సూర్య కుమార్ యాదవ్ కు ఐపీఎల్ 2025లో తిరుగులేకుండా పోతుంది. ఈ సీజన్లో తనదైన శైలిలో   చెలరేగుతున్నాడు. ఈ మెగా టోర్నీలో ఎవరూ చూపించని నిలకడ చూపిస్తున్నాడు. మంగళవారం (మే 6) గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో 24 బంతుల్లో 35 పరుగులు చేసి ఈ  సీజన్ లో 500 పరుగుల మార్క్ అందుకున్నాడు. ప్రస్తుతం 510 పరుగులతో ఆరెంజ్ క్యాప్ ను తన దగ్గరే ఉంచుకున్నాడు. ఈ ఇన్నింగ్స్ తో సూర్య ఒక అరుదైన రికార్డును తన ఖాతలో వేసుకున్నాడు. 

సూర్య ఒకే సీజన్ లో 500 పరుగులు చేయడం ఇది మూడోసారి. ముంబై ఇండియన్స్ తరపున అత్యధిక సీజన్ లలో 500 పరుగుల మార్క్ అందుకున్న ప్లేయర్ గా సూర్య రికార్డ్ సృష్టించాడు. ముంబై ఇండియన్స్ తరపున సచిన్, డికాక్ ఒకే సీజన్ లో 500 పరుగుల మార్క్ ను రెండు సార్లు చేశారు. సచిన్ 2010, 2011లో 500 పరుగులు చేయగా.. డి కాక్ 2019, 2020లో 500+ పరుగుల మార్క్ అందుకున్నాడు. ఇక సూర్య 2018, 2023 లో 500 పరుగుల మార్క్ టచ్ చేయగా.. ప్రస్తుత సీజన్ లో 500 పరుగుల మార్క్ ను అధిగమించాడు.

ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరఫున అత్యధికంగా 500+ సీజన్లు:

సూర్యకుమార్ యాదవ్: 3 సార్లు (2018, 2023, 2025)

సచిన్ టెండూల్కర్: 2 సార్లు (2010, 2011)

క్వింటన్ డి కాక్: 2 సార్లు (2019, 2020)

ఈ మ్యాచ్ విషయానికి వస్తే ముంబై బ్యాటింగ్ లో నిరాశపరించింది. గుజరాత్ బౌలర్ల ధాటికి తలవంచుతూ ఒక మాదిరి స్కోర్ కే పరిమితమైంది. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. జాక్స్ (53) టాప్ స్కోరర్ గా నిలిచాడు. గుజరాత్ బౌలర్లలో సాయి కిశోర్ రెండు వికెట్లు తీసుకున్నాడు. సిరాజ్, అర్షద్ ఖాన్, రషీద్ ఖాన్, కొయెట్జీ, ప్రసిద్ కృష్ణ తలో వికెట్ పడగొట్టారు.