ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌ : నంబర్ వన్ స్థానంలో సూర్య భాయ్

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌ : నంబర్ వన్ స్థానంలో సూర్య భాయ్

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా క్రికెటర్ సూర్యకుమార్  నంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకున్నాడు.  తాజాగా ఐసీసీ వెల్లడించిన ర్యాంకింగ్స్‌ లో  సూర్య 859 పాయింట్లతో నంబర్‌వన్‌గా నిలిచాడు.  ఇటీవల ముగిసిన టీ 20 వరల్డ్ కప్ లో  సూర్య  ఆరు మ్యాచ్‌ల్లో 59.75 సగటు, 189.68 స్ట్రైక్‌ రేట్‌తో 239 పరుగులు చేసి మొత్తం టోర్నీలో టాప్ 3  లో నిలిచాడు.  

ఇక ఆతర్వాత పాకిస్తాన్‌ ఓపెనర్‌ మహ్మద్‌ రిజ్వాన్‌ 836 పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా, పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజం 778 పాయింట్లతో మూడోస్థానానికి చేరుకున్నారు. ఇక బౌలర్ల ర్యాంకింగ్స్‌ విషయానికొస్తే  హసరంగ (శ్రీలంక), రషీద్‌ ఖాన్‌ (అఫ్గానిస్థాన్‌), రషీద్‌ (ఇంగ్లాండ్‌), హేజిల్‌వుడ్‌ (ఆస్ట్రేలియా), సామ్‌ కరన్‌ (ఇంగ్లాండ్‌) వరుసగా తొలి అయిదు స్థానాల్లో ఉన్నారు.