మదర్డెయిరీ డైరెక్టర్పై.. మేనేజర్ ఫిర్యాదు

మదర్డెయిరీ డైరెక్టర్పై.. మేనేజర్ ఫిర్యాదు

యాదాద్రి, వెలుగు: తనపై దాడి చేసి కొట్టాడని మదర్​ డెయిరీ డైరెక్టర్​పై సస్పెండ్​ అయిన మేనేజర్​ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల పాల బిల్లుల విషయంలో అవినీతికి పాల్పడినట్టుగా ఫిర్యాదులు రావడంతో భువనగిరి మిల్క్ సెంటర్​ మేనేజర్​ పంచెద్దుల దశరథను సస్పెండ్​ చేశారు.  డైరెక్టర్​ కస్తూరి పాండు సూచనలతోనే తాను బిల్లులను దారి మళ్లించినట్టుగా దశరథ ఒప్పుకున్నారు.

దీన్ని మనసులో పెట్టుకొని తనను కస్తూరి పాండు పిలిపించుకొని తన ఫోన్​లోని డబ్బు లావాదేవీలకు సంబంధించిన డేటా తీసేయాలని ఒత్తిడి చేశాడన్నారు.  తాను ఒప్పుకోకపోవడంతో దాడి చేసి కొట్టాడని దశరథ భువనగిరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.