అల్లు అర్జున్ నెక్స్ట్ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై సస్పెన్స్

అల్లు అర్జున్ నెక్స్ట్ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై సస్పెన్స్

‘పుష్ప’ చిత్రంతో నేషనల్ అవార్డు దక్కించుకుని పాన్ ఇండియా రేంజ్‌‌‌‌‌‌‌‌లో పాపులారిటీ తెచ్చుకున్నాడు అల్లు అర్జున్. ప్రస్తుతం ‘పుష్ప ద రూల్’ చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నాడు బన్నీ. సుకుమార్ దర్శకత్వంలో శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. ఈ నెల 26 నుంచి రామోజీ ఫిల్మ్‌‌‌‌‌‌‌‌ సిటీలో కొత్త షెడ్యూల్‌ను మొదలుపెట్టనున్నారు. ఈ ఇయర్ ఎండింగ్ లోపు అల్లు అర్జున్ పోర్షన్‌‌‌‌‌‌‌‌ను కంప్లీట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. 

దీని తర్వాత త్రివిక్రమ్‌‌‌‌‌‌‌‌తో బన్నీ నెక్స్ట్ ప్రాజెక్ట్ చేయాల్సి ఉంది. కానీ అంతకంటే ముందు తమిళ దర్శకుడు అట్లీతో  సినిమా చేయాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే స్టోరీ డిస్కషన్స్ పూర్తయ్యాయని, జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారట. ఇటీవల షారుఖ్ ఖాన్‌‌‌‌‌‌‌‌తో ‘జవాన్‌‌‌‌‌‌‌‌’ చిత్రాన్నీ తీసి బ్లాక్ బస్టర్ అందుకున్న అట్లీ.. బన్నీ కోసం యాక్షన్ ప్యాక్డ్ స్ర్కిప్ట్ సిద్ధం చేశాడట. అనిరుధ్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నట్టు సమాచారం. 

ఈ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌పై అతి త్వరలోనే అఫీషియల్ అనౌన్స్‌‌‌‌‌‌‌‌మెంట్ వచ్చే చాన్స్ ఉంది. మరోవైపు అల్లు అర్జున్ కోసం సందీప్ రెడ్డి వంగా సహా పలువురు స్టార్ డైరెక్టర్స్ కొత్త కథలు రెడీ చేస్తున్నట్టు తెలుస్తోంది. మరి వీటిలో ఏది ముందు సెట్స్‌‌‌‌‌‌‌‌కు వెళ్లనుందనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్‌‌‌‌‌‌‌‌గా మిగిలింది.