ఈఎస్ఐ స్కాంలో నిందితుల రిమాండ్ పై సస్పెన్స్

ఈఎస్ఐ స్కాంలో నిందితుల రిమాండ్ పై సస్పెన్స్

హైదరాబాద్: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఈఎస్ఐ స్కాం లో నిందితుల రిమాండ్ పై సస్పెన్స్ కొనసాగుతుంది. స్కామ్‌లో మాజీ డైరెక్టర్ దేవికారాణిని మరోసారి అరెస్ట్ చేశారు అధికారులు. ఒకటే కేసులో రెండోసారి అరెస్ట్ ను నిందితుల తరపు న్యాయవాదులు సవాల్ చేశారు. ఉద్ధేశ‌ పూర్వకంగానే తమ క్లయింట్ లను ఇబ్బంది పెడుతున్నారంటూ వారు వాదించారు. ఇదే తరహా కేసుల్లో సుప్రీం ఇచ్చిన గత తీర్పులను కోర్టుకు తెలిపారు. పాత కేసుకు, ప్రస్తుత కేసుకు నిందితుల పై ఒకే తరహా అభియోగాలు మోపారని ఆరోపించారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు మ‌రికాసేప‌ట్లో తీర్పును వెల్ల‌డించింది.