పాలేరు నవోదయ ప్రిన్సిపాల్ సస్పెన్షన్.. ముగ్గురు సిబ్బందిపై కేసు నమోదు

పాలేరు నవోదయ ప్రిన్సిపాల్ సస్పెన్షన్.. ముగ్గురు సిబ్బందిపై కేసు నమోదు

కూసుమంచి, వెలుగు: ఖమ్మం జిల్లా పాలేరు జవహర్ నవోదయ విద్యాలయం ప్రిన్సిపాల్ చంద్రబాబును ఉన్నతాధికారులు సస్పెండ్​చేశారు. ఈ మేరకు ఆదివారం నవోదయ విద్యాలయ సమితి హైదరాబాద్ రీజియన్ డిప్యూటీ కమిషనర్ గోపాలకృష్ణ ఉత్తర్వులు జారీ చేశారు. యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే స్టూడెంట్​నాగేందర్​కరెంట్​షాక్​తో చనిపోయాడని కలెక్టర్​ఇచ్చిన నివేదిక ఆధారంగా చర్యలు తీసుకున్నారు. ఇన్​చార్జి ప్రిన్సిపాల్​గా నల్గొండ నవోదయ ప్రిన్సిపాల్​నాగభూషణం బాధ్యతలు చేపట్టారు. ప్రాథమిక విచారణలో భాగంగా రీజియన్​అసిస్టెంట్​కమిషనర్ అభిజిత్​బేరా పాలేరులోని స్కూలును సందర్శించారు. 

ఘటనా స్థలాన్ని కరెంట్​బోర్డును, తీగలను ఆయన పరిశీలించారు. సిబ్బందితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. నాగేందర్​ఫొటోకు పూలమాల వేసి నివాళులర్పించారు. అలాగే మృతుడి తండ్రి ఫిర్యాదుతో నవోదయ ప్రిన్సిపాల్​ చంద్రబాబు, పీఈటీ వేణుగోపాల్, ఆర్ట్ టీచర్ వీరస్వామిపై ఆదివారం పోలీసులు కేసు నమోదు చేశారు.