వ‌ర్షాల కోసం స్వ‌రూపానందేంద్ర‌ స్వామీ దీక్ష‌

వ‌ర్షాల కోసం స్వ‌రూపానందేంద్ర‌ స్వామీ దీక్ష‌

తెలుగు రాష్ట్రాల్లో సమృద్ధిగా వర్షాలు పడాలని ఆకాంక్షిస్తూ విశాఖ శ్రీ శార‌దా పీఠాధిప‌తి స్వ‌రూపానందేంద్ర‌ స్వామీజీ స‌న్యాసికారి దీక్ష‌ను చేయ‌నున్నారు.. అమ‌రావ‌తిలో ఈ దీక్ష 15వ (రేపటి నుంచి) తేది నుంచి 17వ తేది వ‌ర‌కూ కొన‌సాగనుంది. ఇవాళ విజ‌య‌వాడ వ‌చ్చిన ఆయ‌న దుర్గమ్మను దర్శించుకున్నారు. తర్వాత మీడియాతో మాట్లాడారు. ఈ నెల 15, 16, 17న లోక కల్యాణార్థం సన్యాసికారి దీక్ష చేయనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్‌,తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జగన్ తో పాటు ఒడిశా సీఎం న‌వీన్ ప‌ట్నాయ‌క్ హాజ‌ర‌వుతున్నారు.