పండక్కి ఊరికెళుతూ.. కారు ప్రమాదంలో ఫ్యామిలీ మృతి

పండక్కి ఊరికెళుతూ.. కారు ప్రమాదంలో ఫ్యామిలీ మృతి

సంక్రాంతి పండగ  పూట విషాదం చోటుచేసుకుంది. సొంతూరికి  వెళుతున్న ఓ ఫ్యామిలీ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది.  కారులో వెళుతున్న ఇద్దరు  ఆటోను ఢీ కొట్టడంతో  ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో జరిగింది.

శంషాబాద్ మండలం  గస్మియ గూడ  దగ్గర  స్విప్ట్ కారు ఆటో బైక్ ను ఢీ కొని కల్వర్టులోకి దూసుకెళ్లాయి.  ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు భార్యాభర్తలు మృతి చెందారు. శంషాబాద్ నుండి షాద్ నగర్ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాద ఘటనతో హైవేపై కాసేపు భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేశారు.