సంక్రాంతి పండగ పూట విషాదం చోటుచేసుకుంది. సొంతూరికి వెళుతున్న ఓ ఫ్యామిలీ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. కారులో వెళుతున్న ఇద్దరు ఆటోను ఢీ కొట్టడంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో జరిగింది.
శంషాబాద్ మండలం గస్మియ గూడ దగ్గర స్విప్ట్ కారు ఆటో బైక్ ను ఢీ కొని కల్వర్టులోకి దూసుకెళ్లాయి. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు భార్యాభర్తలు మృతి చెందారు. శంషాబాద్ నుండి షాద్ నగర్ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాద ఘటనతో హైవేపై కాసేపు భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేశారు.