హైదరాబాద్, వెలుగు: బెర్లిన్లో జరుగుతున్న స్పెషల్ ఒలింపిక్స్ వరల్డ్ సమ్మర్ గేమ్స్లో తెలంగాణ స్విమ్మర్ సిద్ధాంత్ మురళీ కుమార్బ్రాంజ్ మెడల్తో మెరిశాడు. వరల్డ్ గేమ్స్లో తెలంగాణ తరఫున ఇంటర్నేషనల్ మెడల్ నెగ్గిన తొలి స్విమ్మర్గా రికార్డు సృష్టించాడు. బుధవారం జరిగిన లెవెల్– బి మెన్స్ 25 మీటర్ల ఫ్రీస్టయిల్ ఫైనల్లో సిద్ధాంత్ 30.57 సెకండ్లతో మూడో ప్లేస్తో పోడియం ఫినిష్ చేసి బ్రాంజ్ గెలిచాడు. 17 ఏండ్ల సిద్దాంత్ గచ్చిబౌలిలోని శాట్స్ స్విమ్మింగ్ పూల్లో కోచ్ ఆయూశ్ యాదవ్ వద్ద శిక్షణ పొందుతున్నాడు. ఇదే గేమ్స్లో ఆయూశ్ఇండియా స్విమ్మింగ్ టీమ్కు హెడ్ కోచ్గా వ్యవహరిస్తున్నాడు.