
అబుదాబి: కరోనా దెబ్బకు వెనక్కి వెళ్లిపోయిన టీ10 క్రికెట్ను మళ్లీ పట్టాలెక్కించేందుకు నిర్వాహకులు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు నాలుగో ఎడిషన్ను వచ్చే ఏడాది జనవరి 28 నుంచి ఫిబ్రవరి 6 వరకు నిర్వహించేందుకు కసరత్తులు చేస్తున్నారు. అబుదాబిలో జాయేద్ క్రికెట్ స్టేడియంలోనే మ్యాచ్లను పూర్తి చేసేలా షెడ్యూల్ను రూపొందిస్తున్నారు. మొత్తం ఎనిమిది టీమ్లు ఇందులో పాల్గొంటున్నాయి. ‘అబుదాబి టీ10 టైటిల్ను నిలబెట్టుకునేందుకు మేం కట్టుబడి ఉన్నాం. ఈసారి కూడా గెలిచి వరుసగా రెండేళ్లు టైటిల్ నెగ్గిన టీమ్గా చరిత్ర సృష్టిస్తాం. మా ప్లేయర్లు కూడా టోర్నీ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు’ అని మరాతా అరేబియన్స్ కో ఓనర్ పర్వేజ్ ఖాన్ వెల్లడించాడు.
For More News..