వివేక్‌పై ఫేక్​న్యూస్​ ప్రచారం​ చేసినోళ్లప్లై చర్యలు తీసుకోండి

వివేక్‌పై ఫేక్​న్యూస్​ ప్రచారం​ చేసినోళ్లప్లై చర్యలు తీసుకోండి
  • వివేక్ ​వెంకటస్వామిపై ఫేక్​న్యూస్​ ప్రచారం​ చేసినోళ్లప్లై చర్యలు తీసుకోండి
  • పలు పోలీస్​స్టేషన్లలో బీజేపీ లీడర్ల ఫిర్యాదు

రామకృష్ణాపూర్/ బెల్లంపల్లి, పెద్దపల్లి, వెలుగు: మాజీ ఎంపీ, బీజేపీ కోర్​కమిటీ సభ్యులు గడ్డం వివేక్​ వెంకటస్వామిపై సోషల్​మీడియాలో ఫేక్​న్యూస్​ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని బీజేపీ లీడర్లు డిమాండ్​చేశారు. ఈ మేరకు పెద్దపల్లి, గోదావరిఖని, మంథని, సుల్తానాబాద్​, ధర్మారం, బెల్లంపల్లి, రామకృష్ణాపూర్​పోలీసు స్టేషన్లలో గురువారం ఫిర్యాదు చేశారు. రామకృష్ణాపూర్​లో బీజేపీ టౌన్​ ప్రెసిడెంట్​ మహంకాళీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో బీజేపీ సీనియర్​లీడర్​ఆరుముల్ల పోశం, టౌన్​ జనరల్​సెక్రటరీ అరిగేల రవీందర్, బీసీ మోర్చా ప్రెసిడెంట్ పాల రాజు తదితరులు, బెల్లంపల్లిలో బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి, గొల్లపల్లి ఎంపీటీసీ హరీశ్​గౌడ్, బీజేపీ బెల్లంపల్లి టౌన్​ప్రెసిడెంట్​కోడి రమేష్, ​బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యుడు సబ్బని రాజనర్సు, పెద్దపల్లిలో మల్లికార్జున్, దుబాసి మల్లేష్​, కల్వల సంజీవ్​తదితరులు పోలీసులకు కంప్లైంట్​చేశారు. వివేక్​వెంకటస్వామిపై  తప్పుడు ప్రచారం చేసినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, లేకపోతే పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తామన్నారు.