ఏజ్‌‌ లిమిట్‌‌ వినతిపై నిర్ణయం తీసుకోండి : హైకోర్టు

ఏజ్‌‌ లిమిట్‌‌ వినతిపై నిర్ణయం తీసుకోండి : హైకోర్టు

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రంలో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయోపరిమితిని 46 ఏళ్ల నుంచి నుంచి 51 ఏండ్లకు పెంచాలన్న వినతిపత్రంపై నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. గ్రూప్‌‌-1 పోస్టులకు ఫిబ్రవరి 19న జారీ నోటిఫికేషన్​తో పాటు మిగిలిన వాటికి కూడా వయోపరిమితిని పెంచాలని చీఫ్‌‌ సెక్రటరీకి సూచించింది. వయోపరిమితి పెంపుదల కోరుతూ ఎ.శ్రీనివాస్‌‌ రెడ్డి వేసిన పిటిషన్‌‌ను బుధవారం జస్టిస్‌‌ పుల్లా కార్తీక్‌‌ విచారించారు. నాలుగు వారాల్లోగా తగిన నిర్ణయం తీసుకోవాలని ఆదేశించి పిటిషన్‌‌పై విచారణను ముగించారు.