అందమైన కార్లు కాదు… సైకిళ్లు వాడండి

అందమైన కార్లు కాదు… సైకిళ్లు వాడండి

ఢిల్లీ, పంజాబ్, హర్యానా, యూపీ రాష్ట్రాల్లో పంట వ్యర్ధాల దహనంపై గురువారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎస్ఏ బాబ్డే మాట్లాడుతూ.. వరి దుబ్బులను కాల్చడమే కాలుష్యానికి ఏకైక కారణం కాదని కొందరు నిపుణులు చెప్పారన్నారు. మీ అందమైన కార్లను వాడటం మానేయాలి. ఆ పని మీరు చేయరు. మనమంతా బైక్స్‌పై వెళ్ళాలి – మోటార్ బైక్స్ కాదు, సైకిళ్ళు అని తెలిపారు. కాలుష్యాన్ని సృష్టిస్తుంది వరి దుబ్బుల కాల్చివేత మాత్రమే కాదని.. అనధికారికంగా కొందరు నిపుణులు చెప్పినట్లు తెలిపారు. ‘మీ సైకిళ్ళను బయటకు తీయవలసిన సమయమిది అన్నారు.

ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ, ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఓ ఆర్డినెన్స్‌ను జారీ చేసిందని తెలిపారు. దీనిపై స్పందించిన ధర్మాసనం ఈ కాలుష్యం వల్ల ఎవరూ అస్వస్థులు కారాదని, ఒకవేళ ఎవరైనా అస్వస్థులైతే మిమ్మల్ని (ప్రభుత్వాన్ని) బాధ్యులను చేస్తామని తెలిపింది. తదుపరి విచారణ నవంబర్ 6కి వాయిదా వేసింది.