కాంగ్రెస్ ప్రకటించిన న్యాయ్ పథకం పేదవాడి కష్టాలను తీర్చుతుందని, దేశ ఆర్థికవ్యవస్థను రీమానిటైజ్ చేస్తుందని ఏఐసీసీ చీఫ్ రాహుల్గాంధీ చెప్పారు. బుధవారం మధ్యప్రదేశ్లో హోషంగాబాద్ లోక్సభ అభ్యర్థి శైలేంద్ర సింగ్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. మధ్యతరగతి నుంచి లాక్కుని పేదోళ్లకు ఇచ్చేందుకే న్యాయ్ను ప్రతిపాదిస్తున్నారని ప్రధాని నరేంద్ర మోడీ చేసిన కామెంట్లను తప్పుబట్టారు. న్యాయ్ద్వారా ఏ ఒక్క మధ్యతరగతి కుటుంబానికి పైసా నష్టం కానివ్వబోమని హామీ ఇచ్చారు. నీరవ్మోడీ, లలిత్ మోడీ, అనిల్ అంబానీ, విజయ్ మాల్యా, మెహుల్ చోక్సీ, నరేంద్ర మోడీ ల నుంచి అవినీతి డబ్బు వసూలు చేసి పేదలకు పంచుతామని చెప్పారు. కాంగ్రెస్ ప్రతిపాదించిన న్యాయ్ద్వారా పేద కుటుంబాలకు ప్రతినెలా రూ.6వేలు ఇస్తామని, తద్వారా వారికి కొనుగోలు శక్తి లభిస్తుందన్నారు. డీమానిటైజేషన్ దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిందని, పేదోడి చేతిలో డబ్బులు లేకుండా చేసిందన్నారు. డీమానిటైజేషన్ వల్ల ఫ్యాక్టరీలు మూతపడ్డాయని, ఎంతోమంది ఉద్యోగాలు కోల్పోయారని చెప్పారు. అధికారంలోకి రాగానే మధ్యప్రదేశ్లో వ్యాపమ్ కుంభకోణం పై దర్యాప్తు చేపడతామన్నారు.
పెద్దోళ్ల నుంచి వసూలు చేసి..పేదలకు పంచుతాం: రాహుల్
- దేశం
- May 2, 2019
లేటెస్ట్
- ఆదిలాబాద్ జిల్లాలో సీజనల్ వ్యాధులపై యాక్షన్ ప్లాన్ రెడీ
- తెలంగాణలో మూడు రోజులు వానలు... పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్
- గంజాయి మత్తులో యూత్ .. ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్కు కేసులు
- మహిళా సంఘాల సభ్యులకు లోన్ బీమా
- కేసీఆర్ లేఖలో లేవనెత్తిన అభ్యంతరాలు పరిశీలిస్తం : జస్టిస్ నర్సింహారెడ్డి
- ఒక్క టీఎంసీ కూడా కష్టమే! .. మేడిపండు లెక్క తయారైన మేడిగడ్డ బ్యారేజీ
- 3డిలో కాశీ దర్శనం | హైదరాబాద్ లో ధర్ గ్యాంగ్ | పరోటా శిక్షణ | స్కూబా డైవింగ్ రికార్డ్ | V6 తీన్మార్
- జూన్ 20 నుంచి గ్రూప్-4 అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్
- ప్రేమ వ్యవహారం.. తల్లి కొడుకులపై కత్తులు, గొడ్డళ్లతో దాడి..
- చెలరేగిన ఆశా శోభన, మంధాన.. దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం
Most Read News
- AP News:వాలంటర్ల సేవలపై ప్రభుత్వ కీలక నిర్ణయం...
- ముగియనున్న రోహిత్ అధ్యాయం.. టీమిండియా తదుపరి కెప్టెన్ ఎవరు..?
- నేను విచారణకు రాను..నువ్వే దిగిపో : కేసీఆర్
- నిర్జల ఏకాదశి.. జూన్18న తులసి మొక్క దగ్గర ఇలా చేయండి.. లక్ష్మీదేవి కటాక్షం పొందండి..
- Jio AirFiber: ఒక కనెక్షన్..120 డివైజ్ లకు ఇంటర్నెట్..వివరాలిగో
- INDW vs SAW: స్మృతి మంధాన సెంచరీ.. సఫారీల ఎదుట భారీ లక్ష్యం
- యాదగిరి గుట్ట గిరిప్రదక్షిణకు అధికారుల ఏర్పాటు
- బంగాళాఖాతంలో ద్రోణి ప్రభావం: తెలంగాణలో మూడు రోజులు వర్షాలు
- Bakrid Special 2024: ఇదే బక్రీద్ పండుగ వెనుక కథ!
- Traffic Alert:జూన్ 17న నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు.. ఎందుకంటే..