సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల ఏర్పాట్లను పరిశీలించిన తలసాని శ్రీనివాస్ 

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల ఏర్పాట్లను పరిశీలించిన తలసాని శ్రీనివాస్ 

పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరకు లక్షలాది మంది భక్తులు వస్తారని, ఎలాంటి ఇబ్బందులు లేకండా అన్ని ఏర్పాట్లు చేయాలని మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. శనివారం ఆలయ పరిసరాలను ఆయన పరిశీలించారు. ఉదయం 3 గంటల నుంచి బోనాల సమర్పణ జరుగుతుందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని పకడ్బందీగా ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.