- మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత తలసాని
హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కేసీఆర్పై ఉమ్మేస్తే తిరిగి కాంగ్రెస్ నాయకులపైనే పడిందని ఎద్దేవా చేశారు. గురువారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. మేడిగడ్డ బ్యారేజీలో రెండు పిల్లర్లు కుంగితేనే ఎన్డీఎస్ఏ, కాళేశ్వరం కమిషన్ పేరిట విచారణ చేయించారని మండిపడ్డారు.
8బీ, 8సీ ద్వారా నోటీసులు ఇవ్వకుండా విచారణ చేశారని చెప్పారు. సుంకిశాల వాల్, పెద్దవాగు, వట్టెం మునక, ఎస్ఎల్బీసీ కూలిపోయిన ఘటనలో ఎందుకు విచారణ చేయడం లేదని ప్రశ్నించారు. మేడిగడ్డ కుంగిపోతే దానిని రిపేర్ చేస్తామని ఎల్అండ్ టీ ముందుకు వస్తే ప్రభుత్వం బెదిరించిందని ఆరోపించారు. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేస్తామని కాంగ్రెస్మేనిఫెస్టోలో పెట్టి హామీని అమలు చేయకుండా కార్మికులను మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

