
కరోనా వైరస్, లాక్ డౌన్ కారణంగా టాలీవుడ్ లో వేలాది మంది సినీ కార్మికులు పలు ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో సినీ-టీవీ కార్మికులకు సాయమందించేందుకు తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ముందుకొచ్చారు. తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న దాదాపు 14 వేల మంది సినీకార్మికుల కుటుంబాలకు తలసాని ట్రస్ట్ ద్వారా నిత్యావసరాల సాయం అందించేందుకు ప్రణాళికను సిద్దం చేశారు. ఈ సేవా కార్యక్రమం గురువారం నుంచి ప్రారంభం కానుంది. పెద్దల సలహాలు, సూచనలు తీసుకుని తనకు తానుగానే మంత్రి తలసాని ఈ సేవాకార్యక్రమానికి తలసాని ట్రస్ట్ ద్వారా నిత్యావసర సరుకులను ఇవ్వడానికి శ్రీకారం చుడుతున్నారు. గురువారం మొదలు నిత్యం 14 వేల మంది సినీ కార్మికుల కుటుంబాలకు అందే వరకు ఈ సేవా కార్యక్రమం కొనసాగనుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు.