రాష్ట్ర అసెంబ్లీలో కీలక ప్రకటన.. 500 మద్యం షాపులు క్లోజ్

రాష్ట్ర అసెంబ్లీలో కీలక ప్రకటన.. 500 మద్యం షాపులు క్లోజ్

మధ్యపాన నిషేధం దిశగా ఆడుగులు వేస్తోన్న  తమిళనాడులోని డీఎంకే సర్కార్ అసెంబ్లీలో కీలక ప్రకటన చేసింది.  మద్యం షాపులు మూసివేస్తున్నట్లుగా ప్రకటించింది.  ఈ విషయాన్ని ,ఆ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి సెంథిల్ బాలాజీ  వెల్లడించారు. రాష్ట్రంలో దశల వారిగా మద్యం షాపులను ఎత్తివేస్తామని ఆయన తెలిపారు. తొలివిడుతలో భాగంగా 500 మద్యం షాపులను మూసివేస్తామన్నారు. కాగా తమిళనాడులో 5 వేలకు పైగా మద్యం షాపులు ఉన్నాయి.