బీచ్‌లు, బహిరంగ ప్రదేశాల్లో న్యూ ఇయర్ వేడుకలు నిషేధం  

బీచ్‌లు, బహిరంగ ప్రదేశాల్లో న్యూ ఇయర్ వేడుకలు నిషేధం  

దేశంలో రోజు రోజుకీ ఓమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో  పలు రాష్ట్ర ప్రభుత్వాలు న్యూ ఇయర్ వేడుకల ఫై ఆంక్షలు విధిస్తున్నారు.  ఇందులో భాగంగా  తమిళనాడు ప్రభుత్వం  న్యూ ఇయర్ వేడుకల పై ఆంక్షలు విధించింది. రాష్ట్ర వ్యాప్తంగా బీచ్‌లు, బహిరంగ ప్రదేశాల్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ను  నిషేధించింది. బహిరంగ ప్రదేశాలతో పాటు రెస్టారెంట్లు, క్లబులు, పబ్‌లలో న్యూ ఇయర్  వేడుకులను అనుమతించేది లేదని డీజీపీ స్పష్టం చేశారు. కొత్త ఏడాదిలో మెరీనా బీచ్, ఎల్లియాట్స్ బీచ్, నీలంకారీ, ఈస్ట్ కోస్ట్ రోడ్ వంటి పబ్లిక్ ప్లేసుల్లో ప్రజలు ఎవరూ గుంపుగా తిరగరాదని  సూచించారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కొవిడ్ నిబంధనలు పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌ విషయంలో వాహనదారులకు పోలీసులు పలు సూచనలు చేశారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే అరెస్టు చేయడంతో పాటు వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. రాత్రి 11 గంటలలోపు కార్యకలాపాలను ముగించాలని.. కొత్త సంవత్సర వేడుకల్లో భాగంగా ప్రైవేట్ పార్టీలకు కూడా ఆంక్షలు వర్తిస్తాయన్నారు. కుటుంబ సమేతంగా ఇంటి దగ్గరే న్యూ ఇయర్  వేడుకలు జరుపుకోవాలని ఇది వరకే రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తల కోసం..

కడుపులోంచి కోట్ల విలువైన కొకైన్ క్యాప్సూల్స్