రీల్స్ పిచ్చి : మహిళా టీచర్.. ఇంటర్ స్టూడెంట్ తో పారిపోయింది..

రీల్స్ పిచ్చి : మహిళా టీచర్.. ఇంటర్ స్టూడెంట్ తో పారిపోయింది..

తమిళనాడులో ఓ ఆసక్తికరమైన, వింతైన కేసు నమోదైంది. పిల్లలకు మంచి బుద్దులు నేర్పి, సక్రమ మార్గంలో నడిపించాల్సిన టీచరే.. స్టూడెంట్ తో పారిపోయింది. కొన్నేళ్ల క్రితం భర్త నుంచి విడిపోయిన ఆ 32ఏళ్ల మహిళా ఇంగ్లీష్ టీచర్.. ఇంటర్ చదువుతోన్న విద్యార్థి కలిసి కోయంబత్తూరుకు పారిపోయారు. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు.. ఎట్టకేలకు వారి జాడను కనిపెట్టి చెన్నై తీసుకొచ్చి, విచారణ జరుపుతున్నారు. ఈ క్రమంలోనే ఆ టీచర్ పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటవ షోలింగనల్లూరులో చోటు చేసుకుంది.

డిసెంబర్ 20న బాలుడు పాఠశాల నుంచి ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ఉపాధ్యాయులను విచారించగా ఆ రోజు గైర్హాజరైన విషయం తెలిసి షాక్‌కు గురయ్యారు. అనంతరం వారి ఫిర్యాదు మేరకు తాళ్లంబూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. టీచర్ కూడా పాఠశాలకు హాజరుకాలేదని, వారి మొబైల్ లొకేషన్‌లను కోయంబత్తూరులోని కరమడైలో ట్రాక్ చేసినట్లు విచారణలో వెల్లడైంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారించగా.. తాము కరమడై పర్యటనకు వచ్చామని టీచర్ చెప్పింది. ఆ తర్వాత పోలీసులు ఆమెపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అనంతరం ఇద్దరినీ వైద్య పరీక్షల నిమిత్తం పంపినట్లు పోలీసులు తెలిపారు.