ఆ వృద్ధ దంపతులకు సాహస అవార్డు

ఆ వృద్ధ దంపతులకు సాహస అవార్డు

ఇటీవల దొంగలను అత్యంత సాహసంతో ఎదిరించి తరిమికొట్టిన తమిళనాడు వృద్ధ దంపతులకు అరుదైన గుర్తింపు దక్కింది. అక్కడి ప్రభుత్వం సాహస అవార్డు ప్రదానం చేసింది. ఇటీవలే తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న షణ్ముగవేల్ అనే వృద్ధుడితో ఓ దొంగ దాడికి దిగగా, షణ్ముగవేల్ కేకలు విని ఆయన భార్య చేతికి దొరికిన వస్తువులతో వారిపై దాడికి దిగింది.

షణ్ముగవేల్ కూడా దొంగల చేతిలో వేటకత్తులు ఉన్నా వెనుకాడకుండా ఓ ప్లాస్టిక్ కుర్చీతో వారిపై ఎదురుదాడికి దిగిన వీడియో సోషల్ మీడియాల్లో చక్కర్లు కొడుతుంది. షణ్ముగవేల్ దంపతుల మొండిధైర్యం చూసి ఆ దొంగలు పారిపోయారు. ఇప్పుడీ వృద్ధ దంపతుల సాహసాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి, స్వాతంత్ర్య దినోత్సవం నాడు అవార్డు అందించింది. సీఎం పళనిస్వామి చేతులమీదుగా అవార్డును అందుకున్నారు వృద్ధ దంపతులు.