- తాండూరు ఆర్డీవో శ్రీనివాస్
కొడంగల్,వెలుగు : నేషనల్ హై వే నిర్మాణ భూసేకరణకు రైతులు సహకరించాలని తాండూరు ఆర్డీవో శ్రీనివాస్కోరారు. శుక్రవారం కొడంగల్తహసీల్దార్ ఆఫీసులో రైతులతో సమావేశమై మాట్లాడారు. హై వే నిర్మాణంతో ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని ఆర్డీవో సూచించారు. కొడంగల్ టౌన్ బైపాస్నిర్మాణానికి 37 ఏకరాల భూమి అవసరమని, ఉడిమేశ్వరం, అప్పాయిపల్లి, పర్సాపూర్, హస్నాబాద్ గ్రామాల్లో విస్తరణకు సుమారు 5 ఎకరాల భూమిని సేకరిస్తామని వివరించారు.
రైతులకు మేలు జరిగేలా ప్రభుత్వం మూడింతల నష్ట పరిహారం చెల్లించేందుకు సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. భూములు కోల్పోతున్నామని, పరిహారం పెంచాలని రైతులు డిమాండ్ చేశారు. ఉన్నతాధికారులతో చర్చిస్తానని ఆర్డీవో సూచించారు. ఈ సమావేశంలో ఎంపీపీ ముద్దప్ప, పీఎసీఎస్చెర్మన్ శివకుమార్, తహసీల్దార్ విజయ్కుమార్, రైతులు పాల్గొన్నారు.