భూసేకరణకు రైతులు సహకరించాలి : ఆర్డీవో శ్రీనివాస్​

భూసేకరణకు రైతులు సహకరించాలి : ఆర్డీవో శ్రీనివాస్​
  •     తాండూరు ఆర్డీవో శ్రీనివాస్​

కొడంగల్​,వెలుగు : నేషనల్ హై వే నిర్మాణ భూసేకరణకు రైతులు సహకరించాలని తాండూరు ఆర్డీవో శ్రీనివాస్​కోరారు. శుక్రవారం కొడంగల్​తహసీల్దార్ ఆఫీసులో రైతులతో సమావేశమై మాట్లాడారు. హై వే నిర్మాణంతో ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని ఆర్డీవో సూచించారు. కొడంగల్ టౌన్ బైపాస్​నిర్మాణానికి 37 ఏకరాల భూమి అవసరమని, ఉడిమేశ్వరం, అప్పాయిపల్లి, పర్సాపూర్​, హస్నాబాద్​ గ్రామాల్లో విస్తరణకు సుమారు 5 ఎకరాల భూమిని సేకరిస్తామని వివరించారు.

రైతులకు మేలు జరిగేలా ప్రభుత్వం మూడింతల నష్ట పరిహారం చెల్లించేందుకు సిద్ధంగా ఉందని  పేర్కొన్నారు. భూములు కోల్పోతున్నామని, పరిహారం పెంచాలని రైతులు డిమాండ్​ చేశారు. ఉన్నతాధికారులతో చర్చిస్తానని ఆర్డీవో సూచించారు. ఈ సమావేశంలో ఎంపీపీ ముద్దప్ప, పీఎసీఎస్​చెర్మన్​ శివకుమార్, తహసీల్దార్​ విజయ్​కుమార్​, రైతులు పాల్గొన్నారు.