‘ఝుమ్మంది నాదం’తో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది తాప్సీ. ఇప్పుడు సౌత్ సినిమాలు పూర్తిగా మానేసి బాలీవుడ్ మీద మాత్రమే ఫోకస్ పెట్టింది. తాజాగా హిందీ పరిశ్రమలో 10 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ఆమె చేసిన కామెంట్స్ వివాదాస్పదమవుతున్నాయి. ‘దక్షిణాదిలో స్టార్ డం మాత్రమే దక్కింది. బాలీవుడ్లో మంచి పాత్రలు సెలక్ట్ చేసుకోవడం వల్ల గొప్ప సినిమాలు చేయగలిగాను.
ఇప్పుడు చాలా సంతృప్తిగా ఉన్నాను. సౌత్లో అలాంటి ఫీలింగ్ కలగలేద’ని చెప్పింది. దీంతో ఇక్కడి ఆడియెన్స్ మండిపడుతున్నారు. ఇక్కడ కూడా మంచి పాత్రలు సెలక్ట్ చేసుకుని ఉంటే సరపోయేది కదా అంటూ తాప్సీపై సెటైర్లు వేస్తున్నారు.
తనను తెరకు పరిచయం చేసిన ఇండస్ట్రీని అవమానించడం ఏంటని ఆమెపై ట్రోల్స్కి దిగుతున్నారు. టాలీవుడ్లో ఈ బ్యూటీకి గ్లామర్ డాల్ అనే ముద్ర పడటంతో ‘ఛష్మే బద్దూ’ అనే సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. వివాదాలపై బోల్డ్ గా స్పందిస్తూనే సక్సెస్ఫుల్ కెరీర్ను కొనసాగిస్తోంది. ప్రస్తుతం షారుక్ ఖాన్తో డుంకీ, నామ్ షబానా సీక్వెల్లో తాప్సీ నటిస్తోంది.