బాలీవుడ్​లో గొప్ప సినిమాలు చేయగలిగా.. సౌత్ లో అలా కాదు: తాప్సీ షాకింగ్ కామెంట్స్

బాలీవుడ్​లో గొప్ప సినిమాలు చేయగలిగా.. సౌత్ లో అలా కాదు: తాప్సీ షాకింగ్ కామెంట్స్

‘ఝుమ్మంది నాదం’తో హీరోయిన్​గా ఎంట్రీ ఇచ్చింది తాప్సీ. ఇప్పుడు సౌత్​ సినిమాలు పూర్తిగా మానేసి బాలీవుడ్​ మీద మాత్రమే ఫోకస్​ పెట్టింది. తాజాగా హిందీ పరిశ్రమలో 10 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ఆమె చేసిన కామెంట్స్​ వివాదాస్పదమవుతున్నాయి. ‘దక్షిణాదిలో స్టార్​ డం మాత్రమే దక్కింది. బాలీవుడ్​లో మంచి పాత్రలు సెలక్ట్ చేసుకోవడం వల్ల  గొప్ప సినిమాలు చేయగలిగాను.

ఇప్పుడు చాలా సంతృప్తిగా ఉన్నాను. సౌత్​లో అలాంటి ఫీలింగ్​ కలగలేద’ని చెప్పింది. దీంతో ఇక్కడి ఆడియెన్స్​ మండిపడుతున్నారు. ఇక్కడ కూడా మంచి పాత్రలు సెలక్ట్ చేసుకుని ఉంటే సరపోయేది కదా అంటూ తాప్సీపై సెటైర్లు వేస్తున్నారు.

తనను తెరకు పరిచయం చేసిన ఇండస్ట్రీని అవమానించడం ఏంటని ఆమెపై ట్రోల్స్​కి దిగుతున్నారు. టాలీవుడ్​లో ఈ బ్యూటీకి గ్లామర్​ డాల్ అనే ముద్ర పడటంతో ‘ఛష్మే బద్దూ’ అనే సినిమాతో బాలీవుడ్​ ఎంట్రీ ఇచ్చింది. వివాదాలపై బోల్డ్ గా స్పందిస్తూనే సక్సెస్​ఫుల్​ కెరీర్​ను కొనసాగిస్తోంది. ప్రస్తుతం షారుక్​ ఖాన్​తో డుంకీ, నామ్​ షబానా సీక్వెల్​లో తాప్సీ నటిస్తోంది.