పెబ్బేరు: సప్తగిరి రైస్ మిల్లులో టాస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోర్స్ తనిఖీలు

పెబ్బేరు: సప్తగిరి రైస్ మిల్లులో టాస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోర్స్ తనిఖీలు

పెబ్బేరు, వెలుగు: వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్​మండలం శేరుపల్లిలోని సప్తగిరి రైస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మిల్లులో హైదరాబాద్​ నుంచి వచ్చిన టాస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్లు సోమవారం తనిఖీలు చేపట్టారు. 2022–-23 యాసంగి సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సంబంధించి మిల్లు ఓనర్లకు జూన్​ 3న నోటీసులు ఇవ్వగా ఎలాంటి స్పందన రాకపోవడంతో తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఆ సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సంబంధించి 5565.291 మెట్రిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టన్నుల ధాన్యాన్ని టెండర్​ ద్వారా దక్కించుకోగా.. అందులో నుంచి 217.476 టన్నులు మాత్రమే తిరిగి ప్రభుత్వానికి సీఎంఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అప్పగించారు. 

ఇంకా 5347.815 టన్నుల ధాన్యం బకాయి ఉంది. వీటికి సంబంధించిన డబ్బును ఆఫీసర్లు లెక్క తేలుస్తున్నారు. పూర్తి వివరాలను త్వరలో మీడియాకు వెల్లడిస్తామని టాస్క్​ఫోర్స్​ అధికారులు తెలిపారు. దాడుల్లో సివిల్​ సప్లై డీటీలు పరమేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ప్రసాద్​పాల్గొన్నారు.