టాటా ఇన్సూరెన్స్‌ బ్రాండ్ అంబాసిడర్‌గా నీరజ్ చోప్రా

టాటా ఇన్సూరెన్స్‌ బ్రాండ్ అంబాసిడర్‌గా నీరజ్ చోప్రా

న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్ లో బంగారు పతక విజేత నీరజ్ చోప్రాకు ప్రపంచ వ్యాప్తంగా బ్రహ్మరథం పడుతున్నారు. అంతా ఇంతా కాదు.. ఎక్కడ చూసినా.. నీరజ్ చోప్రా కు జనం జేజేలు పలుకుతూ స్వాగతిస్తున్నారు. క్రికెటర్లు తప్ప మరో క్రీడాకారుల గురించి పెద్దగా తెలియని.. పట్టించుకోని భారతదేశంలో ఇప్పుడు నీరజ్ చోప్రా యూత్ కు ఐకాన్ గా మారిపోయాడంటే అతిశయోక్తి కాదేమో. గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా క్రేజ్ ను ఉపయోగించుకునేందుకు ప్రయత్నించని వారు లేరనుకుంటున్న తరుణంలో టాటా ఏఐఏ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ అడుగు ముందుకేసింది. నీరజ్ చోప్రాను బ్రాండ్ బాసిడర్‌గా నియమించుకుంది.

నీరజ్ చోప్రా తమకు బహుళ సంత్సరాల బ్రాండ్‌ భాగస్వామ్యంగా టాటా ప్రకటించింది. దేశవ్యాప్తంగా వినియోగదారులుకు అత్యుత్తమ జీవిత బీమా, ఆరోగ్య బీమా రక్షణకుతోడు, ఆరోగ్య పరిష్కారాలను అందించాలన్న కంపెనీ ప్రయత్నాలకు నీరజ్‌చోప్రా మంచి ఊపు కల్పిస్తారని భావిస్తున్నట్లు టాటా ఏఐఏ లైఫ్‌ పేర్కొంది. నీరజ్‌ భాగస్వామ్యంతో మారుమూల ప్రాంతాలకు కూడా తమ కంపెనీ మరింత విస్తరించడమే కాదు.. క్రికటేతర క్రీడాకారులు, అథ్లెట్లకు మంచి స్ఫూర్తి కలిగిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది.