జనసేనలోకి వంగవీటి రాధా?

జనసేనలోకి వంగవీటి రాధా?

టీడీపీ నేత వంగవీటి రాధాకృష్ణ ఇవాళ(సోమవారం) జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో సమావేశం అయ్యారు. విజయవాడలో పవన్ కల్యాణ్ తో సమావేశమైన రాధా… ఏపీలో రాజకీయాలు, భవిష్యత్ కార్యాచరణపై జనసేనానితో చర్చించినట్టు సమాచారం.

త్వరలోనే వంగవీటి రాధా పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన తీర్థం పుచ్చుకోనున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. 2019 అసెంబ్లీ ఎన్నికలకు 2 నెలల ముందు వైసీపీ నుంచి బయటకొచ్చిన రాధా టీడీపీలో చేరారు. ఎన్నిక ప్రచారంలో కూడా పాల్గొన్నారు.