317 జీవోను వెంటనే రద్దు చేయాలి

317 జీవోను వెంటనే రద్దు చేయాలి

హైదరాబాద్: బేగంపేట్ లోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించేందుకు 317 జీవో బాధిత టీచర్లు ప్రయత్నించారు. నిరసన తెలిపేందుకు వస్తున్న  టీచర్లను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకునే యత్నం చేశారు. ముఖ్య నాయకులను అదుపులోకి తీసుకుని గోషామహల్ పోలీసు స్టేషన్ కు తరలించారు.  ప్రగతి భవన్ వద్ద శాంతియుతంగా నిరసన తెలియజేసే హక్కు కూడా లేదా అంటూ టీచర్లు ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వం తెచ్చిన 317 జీవో వల్ల స్థానికతను కోల్పోయామని ఆందోళన వ్యక్తం చేశారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో తమకు అన్యాయం జరుగుతోందన్నారు.  జీవోతో నష్టపోయిన బాధితులకు ప్రభుత్వం న్యాయం చేయాలని ఉద్యోగ, ఉపాధ్యాయులు డిమాండ్ చేశారు.