హైదరాబాద్, వెలుగు: కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో(కేజీబీవీ) పనిచేస్తున్న టీచర్లకు ఆరునెలల ప్రసూతి సెలవులు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని తెలంగాణ టీచర్స్ జేఏసీ చైర్మన్ పి.శ్రీపాల్రెడ్డి డిమాండ్ చేశారు. సర్కారు బడుల్లో సౌకర్యాలు కల్పించాలని, కంప్యూటర్ విద్యను పునరుద్ధరించాలని కోరారు. సోమవారం పీఆర్టీయూటీఎస్స్టేట్ ఆఫీస్లో టీటీజేఏసీ సమావేశం జరిగింది. తర్వాత టీచర్ఎమ్మెల్సీలు కాటేపల్లి జనార్దన్రెడ్డి, కూర రఘోత్తంరెడ్డిలతో జేఏసీ ప్రతినిధి బృందం కలిసి వెళ్లి.. విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి వినతిపత్రం అందించారు. టీచర్లు, ఉద్యోగులకు 45 శాతం ఫిట్ మెంట్తో వెంటనే పీఆర్సీని ప్రకటించాలని కోరారు. శ్రీపాల్రెడ్డి మాట్లాడుతూ.. మోడల్స్కూల్టీచర్లకు తెలంగాణ ఇంక్రిమెంట్వర్తింపజేయాలని, బడుల కరెంట్బిల్లును కేటగిరీ–7 నుంచి కేటగిరీ–1కి మార్చాలన్నారు. సమస్యల పరిష్కారానికి మినిస్టర్సానుకూలంగా స్పందించినట్టు నేతలు చెప్పారు. మంత్రిని కలిసిన వారిలో టీటీజేఏసీ ప్రధాన కార్యదర్శి హనుమంతరావు, పీఆర్టీయూ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి బి.కమలాకర్రావు, టీపీయూఎస్రాష్ర్ట ప్రధాన కార్యదర్శి నవాత్ సురేశ్, టీటీజేఏసీ రాష్ర్ట నేతలు అబ్దుల్లా, సోమేశ్వర్రావు, విశ్వనాథ సత్యం, శంకర్, రాజయ్య, వెంకటనారాయణ, బాలరాజు తదితరులు ఉన్నారు.
పాత జిల్లాల ప్రకారమే టీచర్ల ప్రమోషన్లు
టీచర్ల ప్రమోషన్లకు సంబంధించి పాతజిల్లాల ప్రకారమే ప్రతిపాదనలు తయారుచేసి పంపాలని అధికారులకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు. స్కూల్ ఎడ్యుకేషన్ సమస్యలపై సోమవారం టీచర్ఎమ్మెల్సీలతో మంత్రి సమావేశమయ్యారు. స్పౌజ్ కేసులకు సంబంధించి అంతర్ జిల్లా బదిలీలు నిర్వహించేందుకు ప్రతిపాదనలు తొందరగా పంపాలన్నారు. టీచర్ల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం అప్గ్రేడ్చేసే అధికారాన్ని జిల్లా అధికారులకు అప్పగించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఎమ్మెల్సీలు అలుగుబెల్లి నర్సిరెడ్డి, జనార్దన్ రెడ్డి, కూర రఘోత్తంరెడ్డి పాల్గొన్నారు.