హనుమకొండ డీఈవో ఆఫీస్ ఎదుట టీచర్ల ధర్నా

హనుమకొండ డీఈవో ఆఫీస్ ఎదుట టీచర్ల ధర్నా

స్పౌజ్ బదిలీలు చేపట్టాలని హనుమకొండ డీఈవో ఆఫీస్ ఎదుట టీచర్లు ఆందోళన చేపట్టారు. ఉపాధ్యాయ దంపతులను కలిపి తమకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు. 13 జిల్లాల్లో వెంటనే బదిలీలు చేపట్టాలని డిమాండ్ చేశారు. భార్యకు ఒక చోట, భర్తకు ఒక చోట విధులు కేటాయించడం పట్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరారు. అనంతరం కలెక్టరేట్ లో వినతిపత్రం ఇచ్చేందుకు టీచర్లు ర్యాలీగా బయల్దేరారు.