
పాల్వంచ, వెలుగు : తెలంగాణ ప్రభుత్వం విద్యారంగంపై ప్రత్యేక దృష్టి సారించిన నేపథ్యంలో టీచర్లు ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాలను అందిపుచ్చుకోవాలని డీఈవో వెంకటేశ్వరాచారి అన్నా రు. సోమవారం పట్టణంలోని కొమ్ముగూడెం జడ్పీహెచ్ఎస్లో జిల్లా భౌతిక శాస్త్ర టీచర్లకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం తరగతి గది డిజిటల్ తరగతి గదిగా మారబోతున్న తరుణంలో టీచర్లు సాంకేతిక రంగాన్ని ఉపయోగించుకోవాలన్నారు.
జిల్లావ్యాప్తంగా చివరి విడతగా నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమంలో 675 మంది టీచర్లు ట్రైనింగ్ పొందుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్ర మంలో జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి ఏ నాగరాజశేఖర్ సెంటర్ ఇన్చార్జిలు సైదులు, బి శ్రీనివాసరావు డీఆర్పీలు పాల్గొన్నారు