ప్రగతిభవన్ ముట్టడి : ఇంకా పోలీస్ స్టేషన్లలోనే టీచర్లు

ప్రగతిభవన్ ముట్టడి : ఇంకా పోలీస్ స్టేషన్లలోనే టీచర్లు

ప్రగతి భవన్ ముట్టడికి వచ్చిన టీచర్లను పోలీసులు ఇంకా వదిలిపెట్టలేదు. దీంతో చిన్నపిల్లలతో పోలీస్ స్టేషన్లలోనే టీచర్లు పడిగాపులు కాస్తున్నారు. వ్యక్తి గత వివరాలు నమోదు చేసుకున్న తర్వాత పంపిస్తారని తొలుత టీచర్లు భావించారు. అయితే పోలీసులు పంపకపోవడంతో వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మధ్యాహ్నం నుంచి కనీస వసతులు లేకపోవడంతో టీచర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రగతి భవన్ ముట్టడికి వచ్చిన టీచర్లను పోలీసులు అరెస్ట్ చేసి పంజాగుట్ట, బొల్లారం, గోశామహల్ పోలీస్ స్టేషన్లకు తరలించారు. అయితే స్టేషన్లలో కనీస భోజన వసతులు కల్పించలేదని టీచర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫుడ్ లేకపోవడంతో తమ పిల్లలు ఇబ్బంది పడుతున్నారని వాపోతున్నారు.